ఎర్ర గులాబీలు సీక్వల్ లో కీర్తి సురేష్..!

August 07, 2020


img

40 ఏళ్ళ క్రితం సంచలనం సృష్టించిన సినిమా ఎర్ర గులాబీలు. భారతీరాజా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. 

ఈ సీక్వల్ లో మహానటి కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. భారతీరాజా డైరక్షన్ లో వచ్చిన ఎర్ర గులాబీలు సీక్వల్ సినిమాను ఆయన తనయుడు మనోజ్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ఈ సినిమా సీక్వల్ కు ఓకే చెబుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన రంగ్ దే సినిమా చేస్తున్న కీర్తి సురేష్ ఆమె నటించిన మిస్ ఇండియా, గుడ్ లైఫ్ సఖి సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.



Related Post

సినిమా స‌మీక్ష