కమెడియన్ పృధ్వి రాజ్ కు కరోనా..?

August 04, 2020


img

టాలీవుడ్ సెలబ్రిటీస్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పతికే డైరక్టర్ రాజమౌళి ఆయన ఫ్యామిలీ కరోనా పాజిటివ్ అని ప్రకటించి హోం క్వారెంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. రీసెంట్ గా డైరక్టర్ తేజకు కరోనా రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసిందే. ఇక లేటెస్ట్ గా థర్టీ ఇయర్స్ పృధ్వి రాజ్ కు కరోనా పాజిటివ్ అని తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పృధ్వి రాజ్ కరోనా టెస్టులు చేయించుకోగా కొన్ని చోట్ల నెగటివ్ కొన్ని చోట్ల పాజిటివ్ వచ్చిందని. ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉండేందుకు హాస్పిటల్ కి వచ్చానని ఓ వీడియో రిలీజ్ చేశారు పృధ్వి. 

సోమవారం మిడ్ నైట్ క్వారెంటైన్ లో జాయిన్ అయ్యాను. ఓ 15 రోజులు క్వారెంటైన్ లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. వెయిటింగ్ ఫర్ గుడ్ హెల్త్. మీ అందరి ఆశీస్సులు.. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు నాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే పృధ్వి రాజ్ మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు రావాలని ఆశిద్దాం.        



Related Post

సినిమా స‌మీక్ష