కరోనా లాక్ డౌన్ వల్ల తను నేర్చుకున్న పాఠం గురించి చెప్పుకొచ్చింది అక్కినేని కోడలు సమంత. లాక్ డౌన్ అని ప్రకటించగానే తను, చైతన్య వెళ్ళి అవసరమైనవి తెచ్చుకున్నామని కాని అవి కొన్నాళ్ళ వరకే వచ్చేలా ఉన్నాయని తెలుసుకుని ఆ తర్వాత ఆలోచించి ఇంట్లోనే మనకు కావాల్సినవి తయారు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వ్యవసాయం మొదలు పెట్టానని అంటుంది సమంత.
కరోనా లాక్ డౌన్ తనకు ఓ మంచి పాఠం నేర్పించిందని అంటుంది సమంత. ప్రతి ఒక్కరు క్రియేటివ్ గా ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. కొందరు డ్యాన్స్ వేస్తారు.. కొందరు వంట వండుతారు కాని తనకు అవేవి రావు కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగకరమైనది చేయాలని అనుకున్నా అందుకే తోటపని.. వ్యవసాయం చేశానని చెప్పారు సమంత.