ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ అయితే ఇద్దరు దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చాడు. అందులో ఒకరు త్రివిక్రం కాగా మరొకరు ప్రశాంత్ నీల్. ఎవరి సినిమా ముందు ఉంటుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇదిలాఉంటే ట్రిపుల్ ఆర్ లో మరో హీరోగా చేస్తున్న రామ్ చరణ్ కూడా తన నెక్స్ట్ సినిమాలను సెట్ రైట్ చేసుకుంటున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న చరణ్ ఓ పక్క పవర్ స్టార్, క్రిష్ సినిమాలో కూడా కెమియో రోల్ ఉంటుందని టాక్.
ఇక లేటెస్ట్ గా సతీష్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో దిల్ రాజు, చరణ్ తో ఆ సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ సినిమా కథ ముందు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లిందట. లైన్ బాగుందని చెప్పాడట కాని అతను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. అందుకే రామ్ చరణ్ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సినిమాకు టైటిల్ కూడా సభకు నమస్కారం అని ఫిక్స్ చేశారట. డైరక్టర్ సతీష్ రామ్ చరణ్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.