మహేష్ సరసన సయీ మంజ్రేకర్..?

June 05, 2020


img

సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ సినిమా పరశురామ్ డైరక్షన్ లో వస్తుందని తెలిసిందే. సర్కారు వారి పాట అంటూ మహేష్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. మహేష్ కూడా సహా నిర్మాతగా ఉంటున్నాడని తెలుస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా బాలీవుడ్ భామ కియరా అద్వానీ మహేష్ తో మరోసారి జత కడుతుందని అన్నారు. 

లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ తో జత కట్టేది కియరా అద్వానీ కాదు సయీ మంజ్రేకర్ అని అంటున్నారు. బాలీవుడ్ ఆర్టిస్ట్ మహేష్ మంజ్రేకర్ తనయురాలైన సయీ మంజ్రేకర్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3లో నటించింది. ఆ సినిమాలో తన లుక్స్ తో బీ టౌన్ ఆడియెన్స్ ను అలరించిన అమ్మడు ఇప్పుడు సౌత్ ఛాన్సులు అందుకుంటుంది. ఎప్పుడు కొత్త హీరోయిన్స్ కు ఛాన్స్ ఇచ్చే మహేష్ ఈసారి పరశురామ్ సినిమాకు సయీ మంజ్రేకర్ కు అవకాశం ఇస్తున్నాడట. మహేష్, సయీ జోడీ అదిరిపోతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమాలో హీరోయిన్ గా ఆమె ఫైనల్ అవుతుందో లేదో త్వరలో తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష