వెబ్ సీరీస్ తీస్తున్న స్టార్ డైరక్టర్

June 01, 2020


img

ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే వారి మీద కూడా దర్శక నిర్మాతల కన్ను పడ్డది. రానున్న రోజుల్లో సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సినిమాల్లో కొద్దిగా వెనుకపడ్డ డైరక్టర్స్, యాక్టర్స్ అంటా వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ తో బిజీగా ఉంటున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వెబ్ సీరీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.    

అసలైతే మహేష్ 27వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రావాల్సి ఉంది. లైన్ ఓకే అనిపించుకున్న వంశీ పైడిపల్లి ఫుల్ స్క్రిప్ట్ తో మహేష్ ను మెప్పించలేకపోయాడు. అందుకే మహేష్ పరశురామ్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ కూడా ఆదివారం రిలీజ్ చేశారు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం సినిమా కన్నా వెబ్ సీరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. వెబ్ సీరీస్ చేస్తున్న వంశీ పైడిపల్లి అందులో కూడా తన మార్క్ చూపిస్తాడో లేదో చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ క్రిష్ వెబ్ సీరిస్ నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష