రీమేక్ కోసం అన్నదమ్ముల ఫైట్

May 30, 2020


img

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ, రానా కాంబోలో ఈ సినిమా వస్తుందని కొందరు.. వెంకటేష్, రానా కలిసి దగ్గుబాటి మల్టీస్టారర్ గా ఈ రీమేక్ చేస్తారని మరొకొందరు అంటున్నారు. తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా తమిళంలో మాత్రం ఆ రీమేక్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ అక్కడ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చేసేది ఎవరో కాదు సూర్య బ్రదర్స్. సూర్య, కార్తీ కలిసి ఈ సినిమాలో నటించాలని అనుకుంటున్నారట. 

పృథ్వి రాజ్ పాత్రలో కార్తీ, బిజూ మీనన్ పాత్రలో సూర్య నటిస్తాడని తెలుస్తుంది. ఇద్దరు ఈగోల మధ్య నడిచే ఈ సినిమా అన్నదమ్ములు కలిసి చేస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. ఇప్పటివరకు సోలోగా సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు మొదటిసారి కెరియర్ లో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరు..? మిగతా కాస్ట్ అండ్ క్రూ ఏంటన్నది తెలియాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష