మహేష్ 'సర్కార్ వారి పాట'

May 28, 2020


img

సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా పరశురామ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా ముహూర్తం పట్టుకుంటారని తెలుస్తుంది. గీతా గోవిందం తర్వాత రెండేళ్లకు పరశురామ్ డైరక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని ఫైనల్ చేసినట్టు టాక్. 

ఇక ఈ సినిమాకు సంబందించి టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాకు టైటిల్ గా సర్కార్ వారి పాట అని పెట్టబోతున్నారట. పొలిటికల్ సెటైర్ గా రాబోతున్న ఈ సినిమాకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని అనుకుంటున్నారట. కథ, కథనాలే కాదు తన మార్క్ డైలాగ్స్ అందించడంలో కూడా పరశురామ్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. మరి సూపర్ స్టార్ తో సినిమా ఎలా తీస్తాడు.. అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష