పుష్ప తర్వాత కూడా పాన్ ఇండియా సినిమానే..!

May 26, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. బన్ని డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉంటుంది. అక్కడ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టిస్తూ ఫ్యాన్స్ ఏర్పరచుకున్నాడు. అందుకే పుష్పని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చేస్తాడని తెలుస్తుంది. 

కొన్నాళ్ళుగా డిస్కషన్స్ లో ఉన్న మురుగదాస్, అల్లు అర్జున్ కాంబో మూవీ త్వరలోనే అఫీషియల్ కానుందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ తో తుపాకి 2 సినిమాకు సిద్ధమవుతున్న మురుగదాస్ ఆ తర్వాత బన్నితోనే మూవీ చేస్తాడని తెలుస్తుంది. బన్ని లాంటి టాలెంటెడ్ హీరోతో మురుగదాస్ లాంటి క్రేజీ డైరెక్టర్ సినిమా పడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఈ కాంబో సినిమా ఎప్పుడు వస్తుంది.. సినిమా ఎలా ఉండబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష