తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ కార్మికులకు తన సహాయాన్ని ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారని తెలుస్తుంది.
14 వేల సినీ, టీవీ కార్ముకులకు సహాయం అందించబోతున్నారు తలసాని. సిని పెద్దల సూచనల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నారు. గురువారం నుండి మొత్తం 14 వేల సినీ, టీవీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందే వరకు ఈ సేవా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఆల్రెడీ కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులు అందరికి నిత్యావసర సరుకుల పంపిణి జరిగింది. ఇప్పుడు మిగిలిన వారికి కూడా మంత్రి సహాయంతో నిత్యావసర సరుకులు అందనున్నాయి.