రాజనే భయం లేదు.. పెదనే జాలి లేదు..!

April 07, 2020


img

కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అందరు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మాటలతో చెబుతుంటే.. మరికొందరు పాటలతో చెబుతున్నారు. ఐతే లేటెస్ట్ గా టాలీవుడ్ యాక్ట్రెస్ మాధవీలత మాత్రం ఒక అద్భుతమైన కవితతో కరోనా ఎవరిని వదిలిపెట్టదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన కవిత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి అంకె నేను అని.. మొదటిస్థానం నాది అని.. అంటూ మొదలు పెట్టిన మాధవీలత రాజనే భయం లేదు.. పెదనే జాలి లేదు.. ఎవరినైనా సరే కరోనా కబళిస్తుందని అన్నారు. 

హీరోయిన్ గా ఫేడవుట్ అయినా ఈమధ్య సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మాధవిలత. కరోనా టైం లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యేకంగా ఆమె చెప్పిన ఈ కవిత మాత్రం చాలా బాగా ప్రచారంలో ఉంది. 4.4 లక్షల దాకా ఈ మాధవీలత కవిత చూడటం జరిగింది. అయితే విని వదిలేయకుండా ఆమె చెప్పిన కవితలోని సారాంశాన్ని గుర్తించి దాన్ని పాటిస్తే బెటర్ అని అంటున్నారు. 

@actressmaadhavi

♬ Sad - MusicoterapiaTeam




Related Post

సినిమా స‌మీక్ష