బాలకృష్ణ-రానా మల్టీస్టారర్..?

March 31, 2020


img

నందమూరి బాలకృష్ణ దగ్గుబాటి రానా కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మలయాళంలో రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్టైన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌నుమ్‌ సినిమా తెలుగు రీమేక్ చేయబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా హక్కులను కొన్నారట. తెలుగులో ఈ మూవీని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మలయాళంలో ఈ సినిమాలో పృథ్వి రాజ్, బిజూ మీనన్ కలిసి నటించారు. 

ఈ సినిమాను తెలుగులో బాలకృష్ణ, రానా కాంబోలో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే కనుక కచ్చితంగా ఆ సినిమా క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రానా నటించిన అరణ్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే ఈ సినిమాతో పాటుగా మళయాళ సినిమా లూసిఫర్ ను కూడా తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్ ఉంటుందని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష