నితిన్ మూవీ ఛాన్స్ పట్టేసిందా..!

March 30, 2020


img

యువ హీరో నితిన్ భీష్మ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్నాడు. రెండేళ్లుగా హిట్టు కోసం తపిస్తున్న నితిన్ కు భీష్మ కెరియర్ లో మంచి హిట్ గా నిలిచింది. వెంకీ కుడుములు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. 

చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మన్మధుడు 2 తర్వాత మళ్ళీ తెలుగులో ఎలాంటి అవకాశాలు అందుకొని రకుల్ మళ్ళీ నితిన్ సినిమాతో ఫామ్ లోకి రావాలని చూస్తుంది. భీష్మ హిట్ అవగా రంగ్ దే కూడా నితిన్ కు హిట్ ఇచ్చేలా ఉంది. సో రకుల్ కు నితిన్ ద్వారా లక్ తగిలేలా ఉంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ముంబై షిఫ్ట్ అయిన రకుల్ బాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటుంది. 



Related Post

సినిమా స‌మీక్ష