రష్మికకు బ్లాంక్ చెక్

February 18, 2020


img

టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న రష్మిక మందన్న ప్రస్తుతం నితిన్ భీష్మతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నితిన్, రష్మిక కలిసి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా డైరక్టర్ వెంకీ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు. ఛలో సినిమాతో రష్మికను టాలీవుడ్ కు తెచ్చిన ఈ డైరక్టర్ ఆ సినిమా కథ చెప్పడానికి బెంగుళూరు వెళ్లి అక్కడ కథ చెప్పి రష్మిక కోసం బ్లాంక్ చెక్ ఇచ్చి వచ్చారట.

రష్మిక అమ్మ గారికి ఆ చెక్ ఇచ్చి వచ్చారట. కిరాక్ పార్టీలో ఆమె నటన చూసి మెచ్చిన వెంకీ ఛలోలో ఎలాగైనా ఆమెనే తీసుకోవాలని అనుకున్నాడు. ఫైనల్ గా రష్మిక ఆ సినిమా చేయడం సినిమా హిట్ అవడం ఆమెకు తెలుగులో గ్రాండ్ వెల్కం పలికినట్టు అయ్యింది. అయితే వెంకీ ఇచ్చిన ఆ చెక్ మీద పాతిక లక్షల రెమ్యునరేషన్ రాసుకున్నారట. మొదటి సినిమాకే ఆ రేంజ్ లో పారితోషికం వసూళు చేసిన రష్మిక ఇప్పుడు దానికి మరో కోటి పెంచి కోటిన్నర దాకా సినిమాకు డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష