పవన్ తో త్రివిక్రమ్

February 18, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా పింక్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లిన పవన్ ఆ తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా తర్వాత పవన్ మరోసారి త్రివిక్రం తో కలిసి సినిమా చేస్తాడని తెలుస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాల్లో రెండు హిట్ కాగా అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యింది. ఈసారి పవన్ కోసం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాశాడట త్రివిక్రం. అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న త్రివిక్రం ప్రాస్తుతం తన తర్వాత సినిమా ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ తో త్రివిక్రం కాంబో అంటే ఆ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉంటాయి. మరి ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.



Related Post

సినిమా స‌మీక్ష