KGF డైరెక్టర్ తో మహేష్.. అల్లు అరవింద్ ప్లాన్ అదిరింది..!

February 17, 2020


img

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా ఉంటుందని టాక్. ఇదిలాఉంటే మహేష్ తో KGF డైరక్టర్ సినిమా గురించి కొన్నాళ్ళు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో తన సత్తా చాటాడు. ఈ డైరెక్టర్ ఇప్పుడు కెజిఎఫ్ చాఫ్టర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 

లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మహేష్ సినిమా లాక్ అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తుంది. మహేష్ తో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ మూవీగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా సుపెర్ హిట్ అయితే మహేష్ మరో ఆలోచన లేకుండా ప్రశాంత్ సినిమాకు సైన్ చేస్తాడు. వంశీ పైడిపల్లి మూవీ పూర్తయ్యాక కాని మహేష్ చేసేది రాజమౌళి తోనా.. లేక ప్రశాంత్ తోనా అన్నది తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష