మహేష్ కోసం థమన్

January 25, 2020


img

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఆల్రెడీ మహర్షితో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ లో మరో సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తుంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 

ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ ను సెలెక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అల వైకుంఠపురములో సినిమాతో సత్తా చాటిన థమన్ వరుస స్టార్ అవకాశాలు అందుకుంటున్నాడు. మహేష్ వంశీ సినిమాకు థమన్ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. సరిలేరు సక్సెస్ తో హాలిడే ట్రిప్ లో ఉన్న మహేష్ హైదరాబాద్ రాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష