పవన్ సమ్మర్ కే వస్తాడట..!

January 17, 2020


img

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుండి స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని తీసుకునే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాకు పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట.

పవన్ లేకుండానే సినిమా 40 శాతానికి పైగా ఉంటుందని.. అందుకే ముందు పవన్ లేని ఎపిసోడ్స్ పూర్తి చేసి ఆ తర్వాత పవన్ సీన్స్ చేస్తారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మే నెల ఆఖరి కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తాడని తెలిసిందే. అయ్తిఏ ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.



Related Post

సినిమా స‌మీక్ష