టాలీవుడ్ కు నో చెబుతున్న కియరా అద్వాని..!

December 09, 2019


img

బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న కియరా అద్వాని తెలుగులో మహేష్ తో భరత్  అనే నేను సినిమా ఛాన్స్ రావడం ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సౌత్ లో కూడా అమ్మడికి డిమాండ్ ఏర్పడింది. రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ చేతినిండా అవకాశాలు ఉండటం వల్ల తెలుగు అవకాశాలు వచ్చినా చేసేందుకు డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరట్లేదట.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమాలో కియరా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కాని ఆ సినిమా అమ్మడు చేయనని చెప్పేసింది. ఇక రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో కూడా కియరాకి ఛాన్స్ వచ్చిందట అయితే డేట్స్ కుదరక ఆ ఆఫర్ కూడా వదులుకుందట. హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సూపర్ హిట్ అవడంతో కియరాకి ఇంకా పాపులారిటీ వచ్చింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో నటించేలా లేదని అనిపిస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష