న్యాయం జరిగింది.. దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సిని ప్రముఖుల ట్వీట్స్..!

December 06, 2019


img

వెటర్నరీ డాక్టర్ దిశా (ప్రియాంకా) హత్యోదంతం యావత్ భారత దేశాన్ని ఒణికించేసింది. హైదరాబాద్ లో జరిగిన దిశా హత్య మనం జీవిస్తుంది ఇలాంటి మృగాల మధ్యలోనా అన్న అనుమానాలు వచ్చేలా చేసింది. దిశా కేసు విషయంలో పట్టుబడిన నలుగురు నిందితులను ఉరి వేయాల్సిందే అని అందరు డిమాండ్ చేశారు. తాజాగా దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేయడం జరిగింది.

సిపి సజ్జనార్ నేతృత్వంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం శుక్రవారం తెల్లవారుఝామున వారు ఎక్కడైతే దిశాని సజీవ దహనం చేశారో అక్కడికే తీసుకెళ్లి ఆదారాలు సేకరించసాగారు. అయితే ఆ టైంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల తుపాఖిలను తీసుకోవాలని ప్రయత్నించారు. అలాంటి టైంలో ఆత్మ రక్షణ కోసం నిందుతులు నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

అయితే ఈ ఘటన పట్ల దేశమంతా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సిని ప్రముఖులు సైతం గొప్పగా స్పందిస్తున్నారు. ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ న్యాయం జరిగింది.. దిశా ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుందని అన్నారు. మంచు మనోజ్ అయితే ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లకు దండం పెట్టాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్త ఇంత కిక్ ఇస్తుందా.. అంటూ చెల్లెమ్మ ఈరోజు నువ్వు దేవుడి వద్దకు చేరావు అంటూ ట్వీట్ చేశారు. సిని సెలబ్రిటీస్ మొత్తం నిందితుల ఎన్ కౌంటర్ పై భారీ ఎత్తున స్పందించారు.



Related Post

సినిమా స‌మీక్ష