మహేష్ 'గ్యాంగ్ స్టర్'

December 05, 2019


img

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. 2020 జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత మహేష్ సినిమా ఎవరితో అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు అయితే మహేష్ 27 వ సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లోనే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మహేష్ తో వంశీ పైడిపల్లి ఆల్రెడీ మహర్షి సినిమా చేశాడు. మహేష్ 25వ సినిమాగా మహర్షి మెమొరబుల్ హిట్ ఇచ్చింది. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ చేసేది వంశీ పైడిపల్లి తోనే అని దాదాపు కన్ఫామ్ అంటున్నారు. 

ఈ మూవీలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. మహేష్ ను అలాంటి పాత్రలో చూడాలని ఫాన్స్ కొన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నారు. వంశీ డైరెక్షన్ లో మహేష్ మళ్ళీ తన ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాడని చెప్పొచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష