వాళ్లను ఉరితీయాలి : చిరంజీవి

November 30, 2019


img

హైదరాబాద్ లో ప్రియాంకా రెడ్డి మీద జరిగిన హత్య గురించి సెలబ్రిటీస్ కూడా ఖండిస్తున్నారు. మనుషులు మరీ ఇంత దారుణంగా.. మృగాల్లా మారడం పట్ల అందరు తమ ఆవేదనను తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో మెసేజ్ షేర్ చేశారు. ప్రియాంకా రెడ్డికి జరిగిన అన్యాయానికి ఆ నింధితులను ఉరి తీయాలని చిరంజీవి అన్నారు.    

ప్రియాంకా రెడ్డి విషయంలో పోలీసులు వెంటనే నింధితులను పట్టుకోవడం జరిగిందని.. నింధితులను ఉరి తీయడమే కరెక్ట్ అని అంటున్నారు చిరంజీవి. ఆడవాళ్లను గౌరవించాల్సిన బాధ్యత మనదని.. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



   



Related Post

సినిమా స‌మీక్ష