కాజల్ కోసం బన్ని డిమాండ్

November 20, 2019


img

అల్లు అర్జున్, త్రివిక్రం కాంబోలో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అదనపు గ్లామర్ కోసం స్పెషల్ సాంగ్ లో ఓ క్రేజీ హీరోయిన్ కోసం చూస్తున్నారట. సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ కోసం త్రివిక్రం అనసూయ, రష్మిలను రిఫర్ చేయగా బన్ని మాత్రం కాజల్ కావాల్సిందే అంటున్నాడట. అవసరమైతే ఆమెకు కోటి రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే ఈ సాంగ్ కు ఒప్పించాలని అంటున్నాడట.

స్టార్ హీరోయిన్ గా కాజల్ ఇప్పటికి కెరియర్ మంచి జోష్ లో ఉంది. అయితే జనతార్ గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ అదరగొట్టిన కాజల్ ఇక మీదట అలాంటి సాంగ్స్ చేయనని చెప్పింది. అల్లు అర్జున్ మాత్రం కాజల్ తోనే ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయండని చెబుతున్నాడట. ఆల్రెడీ కాజల్ తో బన్ని ఆర్య 2లో నటించాడు. ఆ తర్వాత కలిసి చేసే అవకాశం రాలేదు. మరి ఈ స్పెషల్ సాంగ్ లో బన్నితో కాజల్ స్టెప్పులేస్తుందా లేదా అన్నది చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష