ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. దాదాపుగా ఐదారేళ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పరిచయమయ్యారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే తన డ్యూటీ అనేలా ఈ షోలో స్కిట్స్ ఉంటాయి. నాగబాబు, రోజా జడ్జులుగా ఈ షో ఇప్పటికి మంచి టి.ఆర్.పి రేటింగ్స్ తెచ్చుకుంటుంది.
అయితే రీసెంట్ గా ఈ షో డైరక్టర్ నిఖిల్ మల్లెమాల టీం తో రెమ్యునరేషన్ తేడాలు రావడంతో బయటకు వెళ్లాడట. జీ తెలుగు వారు ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడంతో అక్కడకి వెళ్లినట్టు తెలుస్తుంది. నిఖిల్ తో పాటుగా మెగా బ్రదర్ నాగబాబుకి కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చారట. దాంతో ఆయన అక్కడకు జంప్ అయ్యారు. జబర్దస్త్ స్టార్టింగ్ లో కామెడీ చేసిన వేణు, ధన్ రాజ్ లతో గ్యాంగ్ స్టర్స్ అనే కొత్త షో మొదలవుతుంది. జబర్దస్త్ ను ఢీ కొట్టేళా ఈ షో ఉంటుందని తెలుస్తుంది.
నాగబాబు వెళ్లాడని సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలు కూడా జబర్దస్త్ ను వదిలి గ్యాంగ్ స్టర్స్ కు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వారు ప్రస్తుతం అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్ లోనే ఉంటారట. అనసూయ కూడా గ్యాంగ్ స్టర్స్ షోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ షోకి జబర్దస్త్ షాక్ ఇచ్చేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు.