చైతు, అఖిల్ మల్టీస్టారర్.. డైరక్టర్ ఎవరంటే..?

September 18, 2019


img

అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు స్ట్రాంగ్ కెరియర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చైతు కాస్త పర్వాలేదు అనిపించేలా ఉన్నా అఖిల్ ఇంతవరకు బాక్సాఫీస్ హిట్ అందుకోలేదు. చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల అఖిల్ కాస్త నిరుత్సాహంలో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ 4వ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.       

ఇదిలాఉంటే అక్కినేని బ్రదర్స్ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. చైతు ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే శేఖర్ కమ్ముల సినిమా లైన్ లో ఉంది. ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో నాగ చైతన్య, అఖిల్ సినిమా ఉంటుందట. ఇప్పటికే కథ వాళ్లిద్దరికి వినిపించడం ఇద్దరు ఓకే చెప్పడం జరిగిందట. అన్నపూర్ణ బ్యానర్ లోనే నాగార్జున ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష