బిగ్ బాస్ పై శ్వేతా రెడ్డి ఆరోపణలు..!

July 13, 2019


img

స్టార్ మాలో త్వరలో మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 3 పై ఓ పక్క సూపర్ క్రేజ్ ఏర్పడగా మరో పక్క యాంకర్ కమ్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. శ్వేతా రెడ్డి కామెంట్స్ ప్రకారం బిగ్ బాస్ కాదు బ్రోతల్ హౌజ్ అనడం సెన్సేషన్ గా మారాయి. ఫిబ్రవరి లోనే తనతో అగ్రిమెంట్ చేయించుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ గా తనని సెలెక్ట్ చేయలేదని. అంతేకాదు తనకు అగ్రిమెంట్ తాలూఖా జిరాక్స్ కాపీలను కూడా ఇవ్వలేదని అన్నారు శ్వేతా రెడ్డి.  

అంతేకాదు మీరు బిగ్ బాస్ కంటెస్టంట్ గా వెళ్లాలంటే బాస్ ను ఏ విధంగా ఇంప్రెస్ చేస్తారని.. శ్వేతా రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో రెండు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. రెండు సీజన్లకు సంబందించిన పార్టిసిపెంట్స్ ఎవరు ఈ విధంగా ఆరోపణలు చేయలేదు. మరి శ్వేతా రెడ్డి ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది. ఆమెకు మిగతా కంటెస్టంట్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష