శారదా పీఠాదిపతి స్వామి సరూపానంద సరస్వ మీద సింగర్ సునీత సీరియస్ గా ఉంది. ఇటీవల ఓ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన భక్తుల గురించి చెబుతూ సామాన్యులే కాదు సిని సెలబ్రిటీస్ కూడా తన దగ్గరకు వస్తారని అన్నారు. వారిలో చిరంజీవి, రజనీకాంత్ పేర్లు ప్రస్తావించారు. రాజేంద్ర ప్రసాద్ గారై అబ్బాయి తరచు తన దగ్గరకు వాస్తాడని చెప్పారు.
అయితే వీరితో పాటుగా సింగర్ సునీత కూడా తన భక్తురాలే అంటూ చెప్పుకొచ్చాడు స్వరూపానంద సరస్వతి. దీనిపై స్పందించిన సునీత సాధారణంగా తన మీద ఎలాంటి వార్తలు వచ్చినా తాను స్పందించను కాని ఇలాంటి టైం లో స్పందించాల్సి వస్తుంది స్వాతి స్వరూపానంద సరస్వతి తన వద్దకు వచ్చిన భక్తుల పేర్లలో తన పేరు ఎందుకు చెప్పారో తనకు అర్ధం కాలేదని.. ఆయన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యంగా ఉన్నాయని సునీత స్పందించారు.