తారక రాముడే ఆదుకోవాలి..!

May 23, 2019


img

ఏపి ఎలక్షన్స్ కొత్త రాజకీయ సమీకరణాలకు నాంధి పలికింది. 2014లో టార్గెట్ మిస్సైన వైసిపి ఈసారి అధికారం చేజిక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది. వైఎస్ జగన్ ఏపి సిఎంగా ఈ నెల 30న అధికారం చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయపాలైంది. కేవలం 24 చోట్ల మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల ఫలితాల్లో టిడిపి పరాభవం చూసిన కొందరు పార్టీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు.

చంద్రబాబు తర్వాత టిడిపి ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్న ఆందోళన మొదలైంది. చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు అంత సత్తా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసిన లోకేష్ ఓటమిపాలయ్యారు. ఓడిన టిడిపిలో ఈ కొత్త టెన్షన్ కూడా మొదలైంది. అయితే దీన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు బ్రహ్మాజి ట్వీట్ వైరల్ అయ్యింది. మా తారక రాముడే ఆదుకోవాలంటూ బ్రహ్మాజి ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్, నరేంద్ర మోడిలకు కంగ్రాట్స్ చెప్పిన బ్రహ్మాజి మా తారక రాముడే ఆదుకోవాలంటూ టిడిపి గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సారాంశం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మాజి పెట్టాడని కాదు దాదాపు తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా అదే భావన ఉందని ఇన్నర్ టాక్.    





Related Post

సినిమా స‌మీక్ష