మహేష్ అనీల్ రావిపుడి.. ఆ సీన్ హైలెట్ అట..!

May 20, 2019


img

మహర్షి హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబులో జోష్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. తను ఎంచుకున్న కథ ప్రేక్షకుల మెప్పు పొందితే ఆ హీరోకి అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి సంచలన విజయం అందుకుంది. వసూళ్ల లెక్కలు చూస్తుంటే మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీ కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఏమాత్రం లేటు చేయకుండా జూన్ మొదటివారం లోనే మహేష్ 26వ సినిమా మొదలుపెడుతున్నాడు.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందట. రెడ్డి గారి అబ్బాయి టైటిల్ పరిశీలణలో ఉన్న ఈ సినిమాలో ట్రైన్ సీన్ మాత్రం ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉంటుందట. ట్రైన్ లో మహేష్, శ్రీనివాస్ రెడ్డి, బండ్ల గణేష్ ల మధ్య ఓ సీన్ రాసుకున్నాడట అనీల్ రావిపుడి. అది పేపర్ మీద ఉన్నప్పుడే చాలా శాటిస్ఫైడ్ గా అనిపించిందట. ఇక తెర మీద అదిరిపోద్దని అంటున్నారు.  

పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస విజయాలు అందుకున్న అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ తో మరో సూపర్ సెన్సేషనల్ మూవీ అందించాలని చూస్తున్నాడు. మహేష్ కూడా భరత్ అనే నేను, మహర్షి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మహేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు. 



Related Post

సినిమా స‌మీక్ష