తెలుగు సిని నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహా రావు (73) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా శ్వాసకోస సంబందిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మోతీనగర్ తన ఇంటి వద్ద శ్వాస పీల్చడానికి ఇబ్బంది పడుతుంటే వెంటనే మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే చికిత్స చేస్తుండగానే ఆయన మరణించినట్టు తెలుస్తుంది.
చిన్ననాటి నుండి నాటకాల మీద ఆసక్తి ఉన్న రాళ్లపల్లి 1979లో కుక్కాటుకి చెప్పు దెబ్బ సినిమా ద్వాతా తెలుగు తెరకు పరిచయమయ్యారు. 3 దశాబ్ధాలుగా 850 సినిమాలకు పైగా రాళ్లపల్లి నటించడం జరిగింది. తనదైన కామెడీతో మెప్పిస్తూ క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు రాళ్లపల్లి వెంకట నరసిం హా రావు.
శుభలేఖ, ఖైది, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ చివరగా భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాళ్లపల్లి. ఆయన మరణించిన వార్త విని కొందరు సిని ప్రముఖులు రాళ్లపల్లి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి తెలియచేశారు.