గీతా గోవిందం డైరక్టర్ తో మహేష్..!

April 17, 2019


img

విజయ్ దేవరకొండ హీరోగ పరశురాం డైరక్షన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా గీతా గోవిందం. లాస్ట్ ఇయర్ రిలీజైన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ డబుల్ కాగా ఆ సినిమా దర్శకుడు పరశురాం మాత్రం తర్వాత సినిమాపై క్లారిటీ రాలేదు. గీతా గోవిందం తర్వాత బన్నితో సినిమాకు ప్రయత్నించినా నా పేరు సూర్య రిజల్ట్ తర్వాత రిస్క్ ఎందుకని పరశురాం కు హ్యాండ్ ఇచ్చాడు బన్ని.

ఇక సాయి తేజ్ తో సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా ఇప్పుడు పరశురాం మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ ఓ సినిమా కమిట్ మెంట్ ఉంది. ఆ సినిమాను పరశురాం డైరెక్ట్ చేసేలా చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం మహేష్ ను మెప్పించే కథ రాసేందుకు పరశురాం ప్రయత్నాలు చేస్తున్నాడట. మహర్షి తర్వాత మహేష్ అనీల్ రావిపుడి సినిమా చేస్తాడని తెలుస్తుంది. స్క్రిప్ట్ ఫైనల్ అయితే ఆ సినిమా తర్వాత మహేష్, పరశురాం సినిమా ఉంటుందని తెలుస్తుంది.   


Related Post

సినిమా స‌మీక్ష