మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అలియాస్ సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఏప్రిల్ 12 శుక్రవారం రిలీజైంది. మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రలహరి తెలుగు రెండు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించుకుంది.
అయితే ఓవర్సీస్ ఆడియెన్స్ మాత్రం ఈ సినిమాను తిప్పికొట్టారు. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా మొదటిరోజు కలక్షన్స్ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి.
చిత్రలహరి మొదటి రోజు కలక్షన్స్ ఎలా ఉన్నాయో వాటి వివరాలు చూస్తే..
నైజాం : 0.79 కోట్లు
సీడెడ్ : 0.51 కోట్లు
ఈస్ట్ : 0.38 కోట్లు
వెస్ట్ : 0.24 కోట్లు
గుంటూరు : 0.30 కోట్లు
నెల్లూరు : 0.14 కోట్లు
కృష్ణా : 0.24 కోట్లు
ఏపి/తెలంగాణా : 3.02 కోట్లు