ఒకేచోట ఇద్దరు బిల్లాలు..!

February 20, 2019


img

ఒకేచోట ఇద్దరు బిల్లాలు.. టైటిల్ చూసి కాస్త షాక్ అవ్వొచ్చు. తమిళ బిల్లా అజిత్.. తెలుగు బిల్లా ప్రభాస్ ఇద్దరు కలిశారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా అజిత్ బాలీవుడ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. షూటింగ్ గ్యాప్ ఉండటంతో అజిత్ సడెన్ గా పక్కనే షూటింగ్ జరుగుతున్న ప్రభాస్ సాహో సెట్ కు వెళ్లాడట.

బాహుబలితో సంచలన విజయం అందుకున్న ప్రభాస్ ను స్పెషల్ గా కలిసి కాసేపు మాట్లాడారట అజిత్. కోలీవుడ్ లో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అజిత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలవడం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి దిగిన పిక్స్ మాత్రం బయటకు రానివ్వలేదు. సాహో కోసం స్పెషల్ సెట్ లో ప్రభాస్ డిఫరెంట్ మేకోవర్ తో కనిపిస్తాడట అందుకే అజిత్, ప్రభాస్ దిగిన పిక్స్ బయటకు రానివ్వలేదు.



Related Post

సినిమా స‌మీక్ష