గల్లీ బోయ్ గా మెగా మేనళ్లుడు..!

February 19, 2019


img

బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్టైన సినిమా గల్లీ బోయ్. రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. జోయా అక్తర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వసూళ్లు 50 కోట్లు దాటి 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమాపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కన్ను పడిందని తెలుస్తుంది. అందుకే వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడట.

ఇక ఈ రీమేక్ లో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. గల్లీ బోయ్ గా సాయి ధరం తేజ్ ఎలా ఉంటాడు. తెలుగులో ఈ రీమేక్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు. ఇంతకీ ఈ బాలీవుడ్ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసే సత్తా ఎవరికి ఉంది అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష