టి.ఎస్.ఆర్ అవార్డ్స్.. ఒకేవేదికపై చిరంజీవి, బాలకృష్ణ..!

February 18, 2019


img

ప్రముఖ పారిశ్రామికవేత్త కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులను ఇస్తారు. 2018 సంవత్సరంకు గాను అవార్డుల వేడుక ఆదివారం వైజాగ్ సముద్ర తీరంలో జరిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు ఈ అవార్డుల వేడుకల్లో పాల్గొనడం జరిగింది. 2017 సంవత్సరానికి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు గాను బాలకృష్ణ.. 2018 సంవత్సరానికి గాను నాగార్జున ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్నారు.

హీరోలందరి మధ్య అన్నదమ్ముల అనుబంధం, స్నేహబంధం ఉందని ఓ చక్కని మెసేజ్ కూడా ఇచ్చే ఇలాంటి వేడుకలు కారణమవుతాయని అన్నారు చిరంజీవి. అభిమానులు కూడా ఇలాంటి స్నేహ భావం ఉండేలా ఇది దోహదపడుతుందని అన్నారు. ఇక బాలకృష్ణ కూడా అతిథులను పలుకరించి మేమందరం కలుసుకునేందుకు టి.ఎస్.ఆర్ అవార్డ్ వేదిక కావడం జరుగుతుందని.. ఈ అవార్డ్ వేడుక కోసం మేమంతా వెయిట్ చేస్తామని చెప్పారు బాలయ్య. 



Related Post

సినిమా స‌మీక్ష