రోహిత్ మిట్టల్ ను పెళ్లాడిన శ్వేత బసు ప్రసాద్

December 14, 2018


img

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత అమ్మడు సినిమాలు సరిగా సెలెక్ట్ చేసుకోకపోవడంతో కెరియర్ నాశనం అయ్యింది. ఆమె మీద వచ్చిన ఆరోపణలు మీడియా చేసిన హంగామా తెలిసిందే. ఇక్కడ నుండి బాలీవుడ్ వెళ్లిన శ్వేతా బసు ప్రసాద్ అక్కడ అనురాగ్ కశ్యప్ ఫాంటం ఫిలిమ్స్ లో జాయిన్ అయ్యింది.  

అక్కడే దర్శకుడు రోహిత్ మిట్టల్ పరిచయం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగిందట. గోవా బీచ్ లో రోహిత్ కు లవ్ ప్రపోజ్ చేసిన శ్వేతా అతని నుండి యెస్ అనే ఆన్సర్ రాబట్టింది. అనురాగ్ కశ్యప్ ఆధ్వర్యంలో వీరి ప్రేమ పెళ్లి జరిగిందని ముంబై మీడియా చెబుతుంది. పెళ్లి ఫోటోలతో శ్వేతా బసు సర్ ప్రైజ్ ఇచ్చింది.

కేవలం కొంతమంది స్నేహితులనే వీరి పెళ్లికి పిలిచారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత శ్వేతా సెలెక్టెడ్ మూవీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా షార్ట్ ఫిలంస్ మీద ఫోకస్ పెట్టారు ఈ జంట. మరి కొత్త జంటకు కంగ్రాట్స్ తో పాటుగా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.  



Related Post

సినిమా స‌మీక్ష