ఆకాష్ పూరి రొమాంటిక్ టచ్

November 15, 2018


img

చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తూ ఆంధ్రాపోరి సినిమాతో మొదటిసారి హీరోగా ప్రయత్నించిన ఆకాష్ పూరి కొన్నాళ్ల గ్యాప్ తో ఏకంగా పూరి డైరక్షన్ లో మెహబూబా సినిమా చేసినా లాభం లేకుండా పోయింది. ఆ సినిమాకు పూరి నిర్మాతగా కూడా వ్యవహరించడం వల్ల సినిమా పూరికి నష్టాలు తప్పలేదు. అయినా సరే పూరి మళ్లీ తనయుడితోనే మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. 


ఈ సినిమాలో ఆకాష్ సరసన సాయి పల్లవిని నటింపచేయాలని చూస్తున్నారట. సినిమా టైటిల్ కూడా రొమాంటిక్ అని పెట్టబోతున్నారట. సినిమాలో హీరోయిన్ హీరో కన్నా ఐదేళ్లు పెద్దదిగా నటిస్తుందట. అందుకే ఆకాష్ తో సాయి పల్లవిని సెలెక్ట్ చేశారట. ఫిదా హిట్ తర్వాత సాయి పల్లవికి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం సాయి పల్లవి శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమా చేస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష