గోవిందం గురించి చిట్టిబాబు..!

August 17, 2018


img

రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న గీతా గోవిందం గురించి ప్రేక్షకులే కాదు సిని సెలబ్రిటీస్ సైతం మాట్లాడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన రాజమౌళి, మహేష్, సమంత వంటి వారు సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్వీట్ చేయగా తాజాగా ఆ జాబితాలో రంగస్థలం చిట్టిబాబు అదేనండి మన రాం చరణ్ కూడా స్పందించాడు. గీతా గోవిందం సినిమా చూసిన రాం చరణ్ ఒక్క ట్వీట్ తో సినిమా యూనిట్ అందరిని మెచ్చుకున్నాడు.

ఇంతకీ చరణ్ ఏమని ట్వీట్ చేశాడంటే.. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కు ఇది పర్ఫెక్ట్ చేంజ్ ఓవర్ అని.. విజయ్, రష్మికల సహజంగా నటించడం ట్రీట్ గా అనిపించిందని అన్నారు. వారి నటనే సినిమాకు అందం తెచ్చిందని.. మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్ మ్యూజిక్ బాగుందని.. దర్శకుడు పరశురాంకు అభినందనలు అంటూ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం అందరికి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు రాం చరణ్. సినిమా మంచి ఫలితాన్ని అందుకోవడమే కాదు సెలబ్రిటీస్ నుండి ఈ విధమైన రెస్పాన్స్ వస్తుండటం సినిమా విజయోత్సాహం రెట్టింపవుతుంది.    



Related Post

సినిమా స‌మీక్ష