పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో జల్సా నుండి అజ్ఞాతవాసి వరకు అన్ని క్రేజీ సినిమాలే అని చెప్పొచ్చు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవగా ఈ కాంబోపై అనుమానాలు వచ్చేలా చేసింది. పొలిటికల్ టర్న్ తీసుకున్నాక పవన్ సినిమాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. పవన్ సినిమాలకు గుడ్ బై అని చెబుతున్నా మళ్లీ 2020లో సినిమా చేస్తాడని అంటున్నారు.
అది కూడా మళ్లీ త్రివిక్రం డైరక్షన్ లోనే సినిమా ఉంటిందని తెలుస్తుంది. పవన్ కోసం త్రివిక్రం కోబలి కథ సిద్ధం చేసుకున్నాడు. ఆ సినిమా కాకుండా అజ్ఞాతవాసి సినిమా చేశాడు. 2020లో మళ్లీ కోబలి సెట్స్ మీదకు తీసుకెళ్తారని అంటున్నారు. రాయలసీమ కత్తి కథగా కోబలి ఉంటుందని మొన్నమధ్య త్రివిక్రం చెప్పాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లోనే ఈ కోబలి నిర్మితమవుతుందని తెలుస్తుంది.