వినాయక్.. బాలయ్య.. టైటిల్ అదుర్స్..!

June 14, 2018


img

జై సింహా తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమా పూర్తి కాకుండానే వినాయక్ డైరక్షన్ లో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా 'ఏకే 47' అని పెట్టబోతున్నారట. టైటిలే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.

వినాయక్, బాలయ్య చెన్నకేశవ రెడ్డి తర్వాత 16 సంవత్సరాల తర్వాత చేస్తున్న సినిమా ఇది. బాలయ్య బాబు ఫ్యాక్షన్ లీడర్ గా చూపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాలో హీరోయిన్ గా శ్రీయా శరణ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తాడని అంటున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష