ఆ సినిమాకు నిర్మాత చరణే..!

June 14, 2018


img

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమాతో నిర్మాతగా కొత్త స్టెప్ వేశాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. హీరోగానే కాదు నిర్మాతగా కూడా చరణ్ కు తిరుగులేదని ఆ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఈసారి రెండవ మూవీగా భారీ బడ్జెట్ తోనే సైరా అంటూ సంచలనానికి సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కే సైరా నరసింహారెడ్డి సినిమాకు రాం చరణ్ నిర్మాతగా ఉంటున్నారు.

ఇక ముచ్చటగా మూడవసారి తండ్రి సినిమా నిర్మిస్తున్నాడట చరణ్. సైరా సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం చిరు, కొరటాల కాంబో సినిమా నిర్మించాలని చూస్తున్నారట. అందుకే మైత్రి మేకర్స్ తో కలిసి చరణ్ ఈ క్రేజీ మూవీ ప్రొడ్యూస్ చేస్తాడట. కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న కొరటాల శివ ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష