కాజల్ మళ్లీ పక్కా లోకల్ అంటుంది..!

May 26, 2018


img

కెరియర్ ముగింపు దశల్లో ఉందనుకున్న కాజల్ ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో మళ్లీ మంచి ఫాంలోకి వచ్చింది. మరో ఐదేళ్లు ఢోఖాలేకుండా అమ్మడి కెరియర్ సాగుతుంది. ఇక మధ్య మధ్యలో ఐటం గాళ్ గా అందాలను గుమ్మరిస్తుంది అమ్మడు. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ మాస్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ తారక్ కోసం స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమైందట. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం క్రేకీ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా అరవింద సమేత.

పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కాజల్ ను సంప్రదించారట. కాజల్ కూడా అందుకు సరే అన్నట్టు తెలుస్తుంది. పక్కా లోకల్ తో తన పరువాలతో ఆడియెన్స్ ను అలరించిన కాజల్ మళ్లీ అలాంటి క్రేజీ ఐటం తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దసరా బరిలో దిగేలా ప్లాన్ చేస్తున్న అరవింద సమేత సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష