పాపం తమన్నా మళ్లీ ఐటమా..!

May 22, 2018


img

మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ దాదాపు ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. బాహుబలి లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో నటించినా సరే ఆమెకు తగినంత ప్రాధాన్యత దక్కలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అరకొర సినిమాలతో కెరియర్ కొనసాగిస్తున్న తమన్నా కళ్యాణ్ రాం నా నువ్వే సినిమాలో నటించింది. ఆ సినిమాలో తమన్నా అందాలకు పనిపెట్టినట్టు టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.

ఇక మరోపక్క అవకాశం వచ్చినా స్పెషల్ సాంగ్స్ కు అమ్మడు ఓకే చెబుతుందట. జై లవ కుశ సినిమాలో స్వింగ్ జరా అంటూ చిందులేసిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో కూడా ఓ క్రేజీ రీమిక్స్ సాంగ్ కు ఆడిపాడుతుందట. నిన్ను రోడ్డు మీద చూసినాది లగాయిత్తు అనే సాంగ్ గుర్తుంది కదా.. అల్లరి అల్లుడులో నాగార్జున, రమ్యకృష్ణలు కలిసి అదరగొట్టిన సాంగ్ అది. ఆ సాంగ్ రీమిక్స్ లో తమన్నాతో చైతు స్టెప్పులేస్తున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ మాధవన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష