సుప్రీం హీరోతో ఛలో అంటున్నాడా..?

May 22, 2018


img

మెగా మేనళ్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరం తేజ్ 3వ సినిమాకే సుప్రీం హీరో అన్న స్క్రీన్ నేం తెచ్చుకున్నాడు. తిక్క నుండి ఇంటిలిజెంట్ వరకు వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం కరుణకారణ్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా తేజ్ ఐలవ్యూ అని పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత ఛలో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయి ధరం తేజ్.

నాగశౌర్య హీరోగా రష్మిక మందన ఫీమేల్ లీడ్ గా చేసిన సినిమా ఛలో. రెగ్యులర్ కథే అయినా దర్శకుడు ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా ఛలో తెరకెక్కించాడు. అందుకే ఆ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. కన్నడ భామ రష్మిక ఈ మూవీతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సుప్రీం హీరోతో ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల ఓ సినిమా ప్లాన్ చేశాడట. కథా చర్చలు ముగిసినట్టు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఛలో లాంటి క్రేజీ హిట్ అందుకున్న వెంకీ మెగా మేనళ్లుడితో సినిమా అంటే ఎలా ఉంటుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష