మైత్రి నిర్మాణంలో ఆ కాంబో..!

April 23, 2018


img

భరత్ అనే నేను సక్సెస్ తో మహేష్ తన పూర్వ వైభవం తెచ్చుకున్నాడు. ఈ సినిమా యూఎస్ లో మొదటి రెండు రోజుల్లోనే 2.5 మిలియన్ డాలర్స్ వసూళు చేయగా మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా భరత్ కొత్త రికార్డులను సృష్టించనుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ ఆ సినిమా నిర్మిస్తున్నారు. మహేష్ 25వ సినిమాగా చాలా ప్రెస్టీజియస్ గా ఈ సినిమా వస్తుంది.

ఇక దాని తర్వాత మహేష్ 26వ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. 1 నేనొక్కడినే సినిమా తర్వాత సుకుమార్, మహేష్ కలిసి పనిచేయలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయినా మహేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదీగాక రంగస్థలం తో సూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈమధ్యనే మహేష్ కోసం ఓ లైన్ రాసుకున్నాడట. కథ నచ్చిన మహేష్ సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. 

ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లోని మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. మహేష్ శ్రీమంతుడు సినిమాతో నిర్మాతలుగా మారిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టారు.



Related Post

సినిమా స‌మీక్ష