తన తల్లిని అవమానించిన రాం గోపాల్ వర్మ పై తదుపరి చర్య తీసుకునేందుకు లాయర్లతో పాటుగా ఫిల్మ్ చాంబర్ చేరుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటుగా నాగబాబు కూడా ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు. ఆ తర్వాత మెగా హీరోలు అల్లు అర్జున్, రాం చరణ్, సాయి ధరం తేజ్, అల్లు శిరీష్ లు కూడా ఫిల్మ్ చాంబర్ కు చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిల్మ్ చాంబర్ లో నల్ల దుస్తులతో నిరసన తెలిపారు.
ఫిల్మ్ చాంబర్ లో ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి 24 గంటల్లో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని.. లేదంటే తన భవిష్యత్ కార్యచరణ చేపట్టనున్నట్టు పవన్ స్పష్టం చేశారు. పవన్ తో పాటుగా ఫిల్మ్ చాంబర్ లో చర్చ ముగిసిన అనంతరం పోలీసుల సూచనల మేరకు మెగా హీరోలంతా సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయారు. పవన్ పిలుపుతో ఫ్యాన్స్ చాలామంది ఫిల్మ్ చాంబర్ దగ్గరకు వచ్చారు. ఉద్రిక్త వాతావరణం కనిపించడంతో పోలీసులు మెగా హీరోలని ఇంటికి పంపించడం జరిగిందట. తల్లితో సహా ఫిల్మ్ చాంబర్ కు వచ్చిన పవన్ దీక్షకు దిగుతారని అనుకోగా ఇండస్ట్రీ పెద్దలకు 24 గంటలు టైం ఇచ్చినట్టు తెలుస్తుంది.