కాస్టింగ్ కౌచ్ అంటూ కొద్దిరోజులుగా మీడియాలో హడావిడి చేస్తూ సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డి నిన్న పవన్ కళ్యాన్ ను తన తల్లిని దూషిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా తెలుగు హీరోయిన్ మాధవిలత మౌనదీక్ష చేసింది. ఇక మరో పక్క నాగబాబు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తో కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఇండస్ట్రీలో కేవలం కాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు చాలా సమస్యలు ఉన్నాయని. మా ఇప్పటికే వాటికోసం కష్టపడుతుందని.. ఇక పవన్ గురించి వ్యక్తిగత దూషనలు చేసే అధికారం ఎవరు ఇచ్చారని కడిగిపారేశాడు. శ్రీరెడ్డి పేరు ఎత్తకుండానే ఇక మీదట ఎవరు పవన్ కల్యాన్ గురించి కాని మెగా ఫ్యామిలీ జోలికి రావొద్దని అన్నారు. ఇన్ని అంటున్నా సరే పవన్ మౌనంగా ఉంటడం గొప్ప విషయమని. తప్పు చేస్తే తానే వచ్చి ప్రజల ముందు ఒప్పుకునే దమ్ము తన తమ్ముడికి ఉందని అలా మీలో ఎవరికి ఉందని చాలెంజ్ చేశారు నాగబాబు. పరిశ్రమలో ఎవరో ఒకరిద్దరి వల్ల మొత్తం పరిశ్రమను దూషించడం కరెక్ట్ కాదు. ఇక నుండి ఎలాంటి చర్చలు ఈ విషయం పై జరుగ కూడదని ఆయన అన్నారు.