ఎన్టీఆర్-త్రివిక్రం.. సీమ బ్యాక్ డ్రాప్..!

April 18, 2018


img

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం సినిమా మొదలు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. టెంపర్ నుండి వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న తారక్ త్రివిక్రం తో సినిమా ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. ఇక ఈ సినిమా కథ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. కెరియర్ మొదట్లో సీమ కథలతో సూపర్ హిట్లు కొట్టిన తారక్ అదే తరహా సినిమాలు చేయడంతో రొటీన్ అయ్యింది.

అయితే కొన్నాళ్లు ట్రాక్ మార్చి స్టైలిష్ ఎంటర్టైనర్ సినిమాలను తీశాడు. అంతేకాదు ప్రయోగాలను కూడా చేశాడు. కొన్నాళ్లు గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మళ్లీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేస్తున్నాడట. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరా కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష