కొడుకు సినిమా కోసం ఇళ్లు అమ్మేసిన దర్శకుడు..!

April 18, 2018


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న పూరి కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లు ఫేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తనయుడు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పూరి మార్క్ మూవీగా సినిమా పక్కా హిట్ అన్నట్టుగా అనిపిస్తుంది. తనయుడి సినిమా కోసం ఏకంగా ఇళ్లు కూడా అమ్మేశాడని అంటున్నారు.

ఫాం తగ్గేసరికి పూరి సినిమా అంటే అడ్వాన్స్ ఇచ్చే బయ్యర్లు కూడా కరువయ్యారట. అందుకే పూరి తన పాత ఇంటిని 21 కోట్లకు అమ్మేశాడట. అయితే సినిమా ఫస్ట్ కాపీ చూసిన దిల్ రాజు అవుట్ రైట్ కు సినిమా కొనేశాడట. అంతేకాదు శాటిలైట్, రీమేక్ రైట్స్ కలుపుకుని సినిమా లాభాలే తెచ్చాయట. రిలీజ్ కు ముందే పూరి సినిమా మంచి లాభాలు తెచ్చిందట. మరి ఫలితం ఎలా ఉన్నా పూరి మాత్రం సేఫ్ అన్నట్టే. 



Related Post

సినిమా స‌మీక్ష