ఆడియో కోసం అసెంబ్లీ సెట్..!

March 20, 2018


img

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతుండగా సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియోని వైజాగ్ లో రిలీజ్ చేస్తారట. 

అంతేకాదు ఈ సినిమా ఆడియోకి అర కోటి దాకా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. సినిమా ఆడియోని కూడా అసెంబ్లీ సెట్ వేసి రిలీజ్ చేస్తారట. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తుండగా ఆడియోని కూడా అందే కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందట. డిఎస్పి స్పెషల్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష